అజ్ఞాతవాసి ప్రత్యేక పాట పూర్తి చేసిన పవన్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో పవన్‌ పాడిన పాట కాటమరాయుడా… ఇప్పటికి కూడా ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. అలాంటి పాటనే ప్రస్తుతం అజ్ఞాతవాసిలో కూడా పెట్టబోతున్నారు. పవన్‌ 25వ చిత్రంగా తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రాన్ని త్రివిక్రమ్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించడం జరిగింది. తనదైన శైలిలో పంచ్‌ డైలాగ్స్‌తో పాటు, పవన్‌ కళ్యాణ్‌ ఎమోషన్‌కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లేను ప్లాన్‌ చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ అత్తారింటికి దారేది చిత్రం సెంటిమెంట్‌ను రిపీట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్‌తో పాట పాడివ్వడం జరిగింది.

అజ్ఞాతవాసి ప్రత్యేక పాట పూర్తి చేసిన పవన్‌ - Telugu Bullet

పవన్‌ మొదట పాట పాడేందుకు నో చెప్పినా కూడా త్రివిక్రమ్‌ ఒత్తిడి చేయడంతో సరే అన్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ పాట పాడేందుకు అనిరుథ్‌ ఒక చక్కని ట్యూన్‌ను సిద్దం చేశాడు. పవన్‌ వాయిస్‌కు తగ్గట్లుగా ఆ ట్యూన్‌ను సంగీత దర్శకుడు ట్యూన్‌ చేశాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా ఆ పాట రికార్డింగ్‌ పూర్తి అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను కూడా పవన్‌ పోస్ట్‌ చేయడం జరిగింది. ఇక చిత్రం ఆడియో ఇటీవలే విడుదల అయిన విషయం తెల్సిందే. క్రిస్మస్‌ కానుకగా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించగా ఖుష్బు ముఖ్య పాత్రలో నటించింది.