అజ్ఞాతవాసిలో వెంకీ సీన్‌ లేనట్లే…

Pawan Kalyan And Venkatesh Scenes won't add in Agnathavasi

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం అంటే ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే ఎక్కువగా శ్రధ్ద పెట్టాలనే విషయం త్రివిక్రమ్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతా భావించినట్లుగానే త్రివిక్రమ్‌ చాలా చాలా జాగ్రత్తగా ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాని ఫలితం తారు మారు అయ్యింది. ఏమాత్రం ఊహించని విధంగా సినిమా ఉండటంతో ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరుత్సాహ పడుతున్నారు. సినిమాలో సోది కామెడీ ఎక్కువగా ఉన్న కారణంగానే ఫ్లాప్‌ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే వెంకీ సీన్స్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

సినిమాకు రెండవ వారం నుండి రిపీట్‌ ఆడిన్స్‌ను రప్పించాలనే ఉద్దేశ్యంతో వెంకీ సీన్స్‌ను పక్కకు పెట్టారు. రెండవ వారంలో ఆ సీన్స్‌ను జత చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌ సీన్స్‌ను సినిమాలో జత చేసే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ మద్య ఉన్నది కూడా కుల్లు కామెడీ సీన్స్‌ అని, ఇద్దరి మద్య గబ్బర్‌సింగ్‌ ప్రస్థావన వచ్చి, కొంచెం తిక్క ఉంది, కొంచెం లెక్క ఉంది అనే డైలాగ్స్‌ ఉంటాయట. ఆ డైలాగ్స్‌ కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా ఉంటుందని, అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు వెంకటేష్‌ సీన్‌ను యాడ్‌ చేసే ఆలోచనను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సీన్‌ను మరెప్పుడైనా నేరుగా సోషల్‌ మీడియాలో విడుదల చేసే అవకాశం ఉంది.