పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య అయిన రేణుదేశాయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే. పవన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలను తనతో పాటు ఉంచేసుకున్న రేణుదేశాయ్ రెండవ పెళ్లి తర్వాత కూడా పిల్లలను తనతోనే ఉంచుకుంటాను అంటుంది. అయితే కొడుకు అఖీరా నందన్ మాత్రం తండ్రి పవన్తో ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండి విజయవాడలోనే ఉంటున్న పవన్ కళ్యాణ్కు తోడుగా, తండ్రితో పాటే ఉండాలని అఖీరా నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం చదువుతున్న అఖీరా త్వరలోనే మళ్లీ పూణెకు వెళ్లి పోతాడని మెగా వర్గాల నుండి సమాచారం అందుతుంది.
అఖీరా ఎక్కువగా తండ్రి నీడలో ఉండాలని కోరుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న మెగా ఫ్యామిలీలో ఉంటేనే బాగుంటుందని అఖీరా భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. పవన్ కూడా కొడుకు తనపక్కన ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ను హైదరాబాద్ నుండి అన్నా లెజనోవా మరియు అఖీరా వెళ్లి హైదరాబాద్లో కలుసుకున్నారు. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తండ్రికి తోడుగా ఉండాలని అఖీరా భావిస్తున్నాడు. కొన్ని వారాల పాటు అఖీరా పవన్కు తోడుగా ఉండే అవకాశం ఉంది. ఇటీవలే తన కొడుకును జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలవొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ను రేణుదేశాయ్ హెచ్చరించిన విషయం తెల్సిందే.