డ్రగ్స్‌ కేసులో రాజకీయం మొదలైంది..

politicians are entering into drugs rocket case for saving accusced

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ వ్యాపారుల నుండి డ్రగ్స్‌ను కొన్నాళ్లుగా తీసుకుంటున్నట్లుగా పోలీసులు నిర్థారించారు. వారు డ్రగ్స్‌ తీసుకుంటున్నారా అనే విషయం తెలుసుకునేందుకు వారిని విచారించేందుకు ఈనెల 19న హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఏ కేసు అయినా కూడా రాజకీయ నాయకుల ఎంట్రీతో నీరు గారిపోవడం సర్వ సాదారణం. అలాగే ఈ కేసులో కూడా రాజకీయం ఎంట్రీ అయినట్లుగా అనిపిస్తుంది. 

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడుతున్న వారి జాబిత పెద్దగా ఉందని, దాదాపు 20 మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ముందు పోలీసులు ప్రకటించారు. అయితే చివరకు కేవలం 12 మందికి మాత్రమే నోటీసులు అందాయి. కొందరు ప్రముఖుల పేర్లు తొలగించినట్లుగా తెలుస్తోంది. ఏపీ మరియు తెలంగాణ మంత్రులకు ఆ లీస్ట్‌లో సన్నిహితులు ఉన్నారు. దాంతో వారు పావులు కదిపి రాజకీయం వాడి వారి పేర్లను చివరి జాబితాలో లేకుండా చేశారు. వారిలో ఒక స్టార్‌ హీరో కొడుకు మరియు ప్రముఖ నిర్మాత తనయుడు, ఒక ప్రముఖ దర్శకుడి బందువు ఇంకా నిర్మాతకు సంబంధించిన వారు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ 12 మంది కూడా తమకు తెలిసిన రాజకీయంతో బయట పడే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు

డ్రగ్స్‌ తీసుకునే వారికి జీవిత మద్దతు.. విమర్శలు

పటేల్ సర్…తెలుగు బులెట్ రివ్యూ.