Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వడివడిగా మారిపోతున్నాయి. ఎవరి ఎత్తులు వాళ్ళు వేసుకుంటూ మున్ముందుకు వెళుతున్నారు నేతలంతా. అయితే ఎన్నికలకు ఏడాది ఉండగానే ఇంత రాజకీయ వేడి మొదలు కావడానికి ప్రధాన కారణం మాత్రం జనసేన ఆవిర్భావ సభ. అందులో ఆ పార్టీ అధినేత పవన్, చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేయడం. ఆ పై అవిశ్వాసం సహా వివిధ పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. కానీ ఇంత వేడికి కారణం అయిన పవన్ కళ్యాణ్ మాత్రం అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. అందుకు బీజేపీ తో ఆయన లోపాయికారీ రాజకీయం నడుపుతున్నాడని టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణకు ప్రస్తుతం వున్న పరిస్థితులు, పవన్ వ్యవహారశైలి తప్ప నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. అలాంటి సాక్ష్యాలు దొరకడం అంత తేలిక కూడా కాదు. అయితే నాణేనికి ఓ వైపు బొమ్మ వున్నట్టే , రెండో వైపు బొరుసు ఉంటుందని వేరే చెప్పాలా ?. ఇప్పుడు జనసేన అధినేతకు అలాంటి కష్టం ఒకటి రాబోతున్నట్టు ఫిలిం నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పవన్ మీద సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం చేస్తున్న కత్తి మహేష్ మీద మాటల పోరాటం చేసిన పూనమ్ కౌర్ ఆపై ఎవరి పేరు ఎత్తకుండా సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్టులు సంచలనం అయ్యాయి. ఆ పోస్ట్ లు చూసిన వారికి పవన్ మీద సందేహాలు వచ్చాయి. అయితే లోగుట్టు దేవుడికి ఎరుక అన్నట్టు ఇప్పటిదాకా అసలు విషయం ఏంటన్నది అటు బాధితులు, ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు గొంతు ఎత్తలేదు. కానీ ఇప్పుడు ఫిలిం నగర్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోను ఓ విషయం ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ కోసం పూనమ్ కౌర్ ప్రయత్నం చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. చంద్రబాబు ఓకే అంటే పూనమ్ కౌర్ స్వయంగా అమరావతి వెళ్లి ఓ కీలక అంశాన్ని ఆయనకు వివరించవచ్చట. లేదా ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు చంద్రబాబుని పూనమ్ కౌర్ కలిసే ఛాన్స్ ఉందట. అసలు పూనమ్ ఏమి బయటపడుతుందో తెలియకపోయినా ఈ విషయం తెలిసి జనసేన వర్గాలు కంగారు పడుతున్నాయి. ఈ వ్యవహారం ఓ పుకారుగా మిగిలిపోతుందో లేక ఏదైనా సంచలనం సృష్టిస్తుందో చూడాలి.