చరణ్‌ పుట్టిన రోజున కీలక ప్రకటన

Rajamouli Reveals News On Ram Charan Birthday Multi Starrer With NTR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, నందమూరి హీరో ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అతి పెద్ద టాలీవుడ్‌ మల్టీస్టారర్‌ చిత్రం గురించి తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ జక్కన్న ఒక వీడియోను విడుదల చేసి అధికారికంగా మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటుందని, త్వరలోనే సెట్టింగ్స్‌ మరియు ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంకు సంబంధించిన కీలక ప్రకటనను రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా అంటే మార్చి 27న చేసేందుకు జక్కన్న అండ్‌ టీం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం విడుదలైన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ తర్వాత అంటే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్‌ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రాన్ని దానయ్య దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. ఈ చిత్రంలో చరణ్‌, తారక్‌లు అన్నదమ్ముళ్లుగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత జక్కన్న చేయబోతున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం అంచనాలు భారీగా పెట్టేసుకున్నారు. మరి అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి అంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.