వైజాగ్‌లో కాదు విజయవాడలో..!

Bharath Ane Nenu Audio Release Shifted From Vizag To Vijayawada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అను నేను’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను వైజాగ్‌లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే ‘రంగస్థలం’ ఆడియో వేడుకను వైజాగ్‌ బీచ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడం జరిగింది. ఆ వేడుక సూపర్‌ సక్సెస్‌ అవ్వడంతో భరత్‌ అను నేను వేడుకను కూడా అక్కడే నిర్వహించాలని భావిస్తున్నారు అంటూ సినీ వర్గాల ద్వారా కూడా సమాచారం అందింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భరత్‌ అను నేను చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం వైజాగ్‌లో కాదని, విజయవాడ కృష్ణా తీరంలో నిర్వహించాలని నిర్ణయించారట. 

మహేష్‌బాబు ఆడియో వేడుకు ఎక్కువగా హైదరాబాద్‌లో జరుగుతాయి. కాని ఈసారి మాత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అవ్వడంతో పాటు, పబ్లిసిటీ స్టంట్‌గా విజయవాడలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంను వచ్చే నెల భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడీగా కైరా అద్వానీ నటించింది. శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సినీ వర్గాల దృష్టితో పాటు, అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంది. శ్రీమంతుడు చిత్రం ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే ఈ చిత్రం కూడా తప్పకుండా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలవడం ఖాయం అంటూ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు. సినీ విశ్లేషకులు కూడా సినిమాలో మ్యాటర్‌ ఉంటుందనే విశ్వాసంతో ఉన్నారు.

వైజాగ్‌లో కాదు విజయవాడలో..! - Telugu Bullet