మహానటికి మెగా రిలీఫ్‌

ram charan's rangasthalam 1985 movie release on march 30

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న సావిత్రి జీవిత చరిత్ర అంతా గందరగోళం. ఆమె చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. అలాగే ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మద్య తుది శ్వాస విడిచారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అసలు విషయాలు మాత్రం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. తాజాగా ‘మహానటి’ చిత్రంతో సావిత్రి జీవిత చరిత్రను ఆవిష్కరించేందుకు నాగ్‌ అశ్విన్‌ సిద్దం అయ్యాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ మరియు సమంతలు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘మహానటి’ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాకు మెగా మూవీ ‘రంగస్థలం’ పోటీ కాబోతుందని అంతా భావించారు.

తాజాగా చరణ్‌ ‘రంగస్థలం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల అయ్యింది. ఈ సందర్బంగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. మార్చి 30న ‘రంగస్థలం’ విడుదల కాబోతున్నట్లుగా ఫస్ట్‌లుక్‌లో పేర్కొనడం జరిగింది. దాంతో మెగా మూవీ కారణంగా ‘మహానటి’కి ఎలాంటి ఇబ్బంది లేదని తేలిపోయింది. కనీసం ఒక్క రోజు గ్యాప్‌ ఉండటం వల్ల ‘మహానటి’కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రోజు నుండి రెండు చిత్రాలు కూడా కలెక్షన్స్‌ను షేర్‌ చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు భావిస్తున్నారు. ‘మహానటి’ చిత్రంపై ఉన్న భారీ అంచనాల కారణంగా తప్పకుండా భారీ కలెక్షన్స్‌ వస్తాయని సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.