కెలికి మరీ  అవమానపడ్డ అరికెపూడి  గాంధీ.

serilingampally-mla-arekapudi-gandhi-insulted-kphb-audiance

    Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కార్తీక మాసంలో పూజల సంగతి ఎలా వున్నా వీధివీధికి కుల భోజనాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో ఇదే అదనుగా రాజకీయ నాయకులు కూడా ఈ కుల భోజనాలకు బాగానే తిరుగుతున్నారు. అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకునే విధంగా నాలుగు మాటలు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ కుల భోజనాల్లో నాయకులు చెప్పే మాటలు నమ్మేవారేమో కానీ ఇప్పుడు వాటికి హాజరయ్యే జనం కూడా నేతల డైలాగ్స్ ని లైట్ తీసుకుంటున్నారు. అంత సాదాసీదాగా జరిగే వ్యవహారాన్ని కూడా సంక్లిష్టం చేసుకున్నాడు ఓ ఎమ్మెల్యే. ఆయనే అరికెపూడి గాంధీ. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. టీడీపీ లో గెలిచి తెరాస చేరిన ఈ నేతకి అనుకోని విధంగా అవమానం తప్పలేదు.
 Arekapudi Gandhi
హైదరాబాద్ ,కేపీహెబీ కాలనీ కమ్మ సంఘం తరపున ఆదివారం రోజు వనభోజనాలు నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్మ కులానికి చెందిన నాయకులు చాలా మంది వచ్చారు. వారితో పాటు వచ్చిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రసంగంలో తాను పార్టీ మారిన విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీ నుంచి తాను పదవీ వ్యామోహంతో పార్టీ మారలేదని, ప్రజలతో పాటు కులానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుందని తెరాస లో చేరినట్టు గాంధీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటిదాకా మౌనంగా వున్న సభికుల్లో ఒక్కసారిగా గాంధీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కొందరు గాంధీ ప్రసంగానికి అడ్డు తగులుతూ జై టీడీపీ, జై జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దీంతో గాంధీ కెలికి మరీ అవమానపడ్డట్టు అయ్యింది