జగన్ కామెంట్స్ తో కామెడీ…శిల్పాకి మాత్రం టెర్రర్.

shilpa-mohan-reddy-worry-with-ys-jagan-funny-comments-in-nandyala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో చంద్రబాబుని కాల్చినా తప్పు లేదన్న వ్యాఖ్యలతో హీట్ పెంచిన వైసీపీ అధినేత జగన్ తాజా కామెడీ ఎపిసోడ్ తో కాస్త వాతావరణం చల్లబరిచాడు. ఇంతకీ కామెడీ ఎపిసోడ్ ఏమిటంటే ప్రచారంలో తన దగ్గర ఎన్నికల్లో పంచడానికి డబ్బు లేదని చెప్పడమే. జగన్ ఇలా బీద పలుకులు పలకడం చూసి అంతా నవ్వుకుంటున్నారు. రాజకీయంగా లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సిబిఐ కేసులతో అల్లల్లాడుతున్న వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే జాలి కలగకపోగా కామెడీ గా అనిపిస్తోంది. జగన్ ఈ డైలాగ్ చెప్పిన దగ్గర నుంచి నంద్యాల లో ఇదే విషయం మీద చర్చ పెరిగింది. జగన్ అవినీతి వ్యవహారాలు మళ్లీ అందరి కళ్ళకి కడుతున్నాయి.

జగన్ కామెంట్స్ తో వైసీపీ శ్రేణులు కూడా తల పట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా బరిలో నిలిచిన శిల్పా మోహన్ రెడ్డి అయితే ఉలిక్కిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ముందుగా ఆర్ధికంగా పార్టీ తరపున సపోర్ట్ చేస్తామన్న జగన్ చివరకు అభ్యర్థులకు ఫోన్ చేసి తన పేరు చెబితే జనం ఓట్లు వేస్తారని చెప్పి హ్యాండ్ ఇవ్వడం గురించి అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అదే విషయం శిల్పా చెవిన పడకుండా ఉంటుందా?. ఇప్పుడు తనకు అదే పరిస్థితి ఎదురైతే ఏమి చేయాలని శిల్పా ఆందోళన పడుతున్నారు. మొత్తానికి జగన్ కామెంట్స్ అందరికీ కామెడీగా అనిపిస్తుంటే వైసీపీ అభ్యర్ధికి మాత్రం టెర్రర్ పుట్టిస్తున్నాయి.

 మరిన్ని వార్తలు:

రెవిన్యూలోటూ పూడ్చేది లేదు

మోత్కుపల్లికి ఈసారైనా పదవి దక్కుతుందా..?

జనసేన మొదటి పొలిటకల్ ఎంట్రీ