బాలీవుడ్లో బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా హిందీ ప్రేక్షకులను బయోపిక్లు పలకరిస్తున్న నేపథ్యంలో తెలుగులో కూడా వరుసగా బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. భారీ ఎత్తున బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 150 కోట్ల బడ్జెట్తో చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇంకా పలు బయోపిక్ తెరకెక్కుతున్నాయి. బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి బడ్జెట్ 60 కోట్లు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. బాలకృష్ణ కెరీర్లోనే అతి భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం గురించి చెబుతున్నారు.
బాలకృష్ణ కెరీర్లో ‘ఎన్టీఆర్’ ముందు వరకు అతి భారీ చిత్రం అంటే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. 50 కోట్ల లోపు బడ్జెట్తో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక అంతకు ముందు చిత్రాలు 25 నుండి 30 కోట్ల మద్యలోనే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ‘ఎన్టీఆర్’ చిత్రంను ఏకంగా 60 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. స్వయంగా బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాంతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ చిత్రంలో నటించేందుకు ఏకంగా రెండు కోట్ల పారితోషికం అందుకుంటుంది. ఈమె కేవలం 20 నిమిషాలు మాత్రమే స్క్రీన్పై కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. 15 నుండి 20 రోజుల పాటు ఈమెతో సీన్స్ను తెరకెక్కించబోతున్నారు. ఎన్టీఆర్ మూవీ కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తున్నారు. అందుకే ఈ చిత్రం అంతగా వసూళ్లు రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం 75 కోట్ల షేర్ను రాబట్టింది. ఆ రేంజ్లో వసూళ్లు సాధిస్తే నిర్మాత సేఫ్ అవ్వడం ఖాయం. కాని ఫలితం తారు మారు అయితే బాలయ్య భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.