అబ్బో… శ్రియ ఇంకా తీసుకుంటుందా?

Shriya Remuneration For Venkatesh Teja Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వెంకటేష్‌, తేజల కాంబో మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తేజ మరో సక్సెస్‌ను వెంకటేష్‌తో దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేయడం జరిగింది. ఈమద్య శ్రియ సీనియర్‌ హీరోలకు పెద్ద దిక్కు అవుతుంది. శ్రియ హీరోయిన్‌గా వరుసగా బాలయ్యతో రెండు చిత్రాలు నటించడంతో పాటు ఆ మద్య వెంకీతో ఒక చిత్రాన్ని చేసింది. తాజాగా మరోసారి వెంకీకి జోడీగా శ్రియ నటించే అవకాశం దక్కించుకుంది.

తేజ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో శ్రియ హీరోయిన్‌గా నటించేందుకు ఏకంగా 60 లక్షల పారితోషికాన్ని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రియకు వయస్సు మీద పడటంతో పాటు, అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఇలాంటి సమయంలో శ్రియ ఏకంగా 60 లక్షల పారితోషికాన్ని తీసుకోవడం అందరికి షాకింగ్‌గా ఉంది. బాలకృష్ణతో చేసిన రెండు చిత్రాలు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరియు ‘పైసా వసూల్‌’ చిత్రాలకు గాను 50 లక్షల లోపు పారితోషికం తీసుకున్న శ్రియ ఈసారి వెంకీతో నటించేందుకు మాత్రం ఇంత పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యం అని చెప్పాలి. ఈ చిత్రంలో శ్రియకు చాలా ముఖ్యమైన పాత్ర ఉందని, అలాగే ఎక్కువ డేట్లు అడిగిన కారణంగానే శ్రియ ఇంత డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది.