అలకపాన్పు దిగిన సోము…కాసేపట్లో మీడియా ముందుకు

Somu Veerraju coming to Media after Kanna appoints as AP BJP President

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గుంటూరుకు చెందిన కీలక కాపునేత కన్నా లక్ష్మీనారాయణకు అమిత్ షా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో సోము వీర్రాజు తీవ్ర నిరాశకు గురయ్యి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు ఉదయం నుండి వార్తలు వచ్చాయి. ఆయన మీడియా ముందుకు వచ్చి ఖండించకపోవడంతో ఆ వార్తలకి బలం చేకుర్చినట్టు అయ్యింది. నిన్న ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో తెలుగు మీడియా మొత్తం అజ్ఞాతంలోకి సోము వీర్రాజు అంటూ కధనాలు ప్రసారం చేయడంతో ఆయన మీడియా ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరాసావహిస్తానని పేర్కొంటూ ఆయన బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి లేఖ రాశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని ఆయన అన్నారు. కాసేపట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన చేయనున్నారు.