Sports: తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్ 336/6

Sports: At the end of the first day's play, India's first innings was 336/6
Sports: At the end of the first day's play, India's first innings was 336/6

వైజాగ్ వేదికగా జరుగుతున్న భారత్–ఇంగ్లండ్ రెండో టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ లో భారత్ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. 17 ఫోర్లు, 5 సిక్స్ లతో 179 నాటౌట్ గా భారత్ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ నిలిచాడు.

దీంతో టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు రికార్డు టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ సాధించాడు. ఇక అటు రోహిత్ శర్మ 14 పరుగులే చేసి నిరాశపర్చాడు. అలాగే శుభ్మన్‌ గిల్ 34, శ్రేయాస్ 27 పరుగులు చేశారు. రజత్ పటిధార్ 32, అక్షర్ పటేల్ 27, శ్రీకర్ భరత్ 17 పరుగులు చేశారు. ఇక ప్రస్తుతం క్రీజులో అశ్విన్, జైస్వాల్ ఉన్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టామ్ హార్ట్లీ కు ఓ వికెట్‌ పడగొట్టారు.