Sports: భారత్ కు బిగ్ షాక్.. స్వదేశానికి వస్తున్న కోహ్లీ..

Sports: Big shock for India.. Kohli coming home..
Sports: Big shock for India.. Kohli coming home..

దక్షిణాఫ్రికా తో టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ కు మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ టెస్ట్ సిరీస్ కు దూరం కాగా… తాజాగా కోహ్లీ “ఫ్యామిలీ ఎమర్జెన్సీ” కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చాడని బీసీసీఐ వెల్లడించింది. అయితే డిసెంబర్ 26వ తేదీన ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కి జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. అలాగే రెండు టెస్ట్ జనవరి 3న ప్రారంభమై జనవరి 7వ తేదీన ముగుస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు చేరాలంటే ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.

దక్షిణాఫ్రికా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి బీసీసీఐ ప్రకటించిన టీం :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్,సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ*, జస్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ కృష్ణ,రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (wk.),కేఎల్ రాహుల్ (wk.), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.