Sports: మహమ్మద్ షమీ లేకుండానే సౌత్ ఆఫ్రికా వెళ్లిన భారత్ !

Sports: India went to South Africa without Mohammed Shami!
Sports: India went to South Africa without Mohammed Shami!

వరల్డ్ కప్ తర్వాత భారత్ ఆడిన తొలి సిరీస్ లో ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో సౌత్ ఆఫ్రికా తో మూడు టీ20 లు, మూడు వన్ డే లు మరియు రెండు టెస్ట్ లను ఆడడానికి ఇటీవల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బీసీసీఐ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం బెంగుళూరు నుండి డర్బన్ కు దుబాయ్ మీదుగా భారత్ టీం బయలుదేరింది. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ వెళ్లిన వారిలో భారత్ టీం పేసర్ మహమ్మద్ షమీ లేడు.. ఇతను వరల్డ్ కప్ సమయంలోనే యాంకిల్ గాయంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అత్యధిక వికెట్లు తీసుకుని సంచలనం సృష్టించాడు. ఇక ఇతను ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు..

మరి టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకుని జట్టుతో చేరుతాడా లేదా కోట్లాదిమంది అభిమానులకు షాక్ ఇస్తాడా అన్నది తెలియాలంటే రేప్రొటీస్ వచ్చే వరకు ఆగాల్సిందే.