Sports: టీమిండియాకు మరో ఫినిషర్ దొరికాడు.!

Sports: Team India got another finisher.!
Sports: Team India got another finisher.!

భారత్ జట్టుకు యువ క్రికెటర్ రింకు సింగ్ తన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్నారు. పిచ్ ఎలా ఉన్నా, టార్గెట్ ఎంతైనా ఒత్తిడిలోనూ మ్యాచులను గెలిపించుకొని వస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 22* రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐపీఎల్ తో పాటు ఇతర టోర్నిలోను అద్భుతంగా రాణించారు.

దీంతో రాబోయే టీ20 WCలో అతను ఫినిషర్ గా ఇండియాకు మంచి విజయాన్ని అందిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బాల్స్ లో 4 సిక్స్ లు, 9 ఫోర్లతో 80 రన్స్ చేశాడు సూర్య కుమార్‌ యాదవ్‌. అటు దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్.. 39 బాల్స్ లో 5 సిక్స్ లు, 2 ఫోర్ల తో 58 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 21 రన్స్ చేశాడు.