బిగ్ బాస్ -2 ఈ సారి ఇంకాస్త మసాలా… శ్రీ రెడ్డి కూడానా ?

Sri Reddy in Bigg Boss Season 2 Telugu Reality show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో ‘బిగ్ బాస్‌’ ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడంతో, రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ‘బిగ్‌బాస్’ సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం కూడా ఖరారైంది. వంద రోజులు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో 16మంది పార్టిసిపెంట్స్‌ హంగామా చేసి వీక్షకులను అలరించబోతున్నారు. ఈ రెండో సీజన్ కు హీరో నాని యాంకర్ గా వ్యవహరించనున్నాడు. ఈ షో కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది.

ఈసారి ఇంకాస్త మసాలా అంటూ చెప్పడం చూసి ఇందులో ఖచ్చితంగా టాలీవుడ్ వివాదాస్పద నటి, క్యాస్టింగ్ కౌచ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే నాని చెప్పినట్టుగానే ఈసారి ఇంకాస్త మసాలా అన్నదానికి ఫర్ఫెక్ట్ మ్యాచ్ శ్రీరెడ్డి. ఇక ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేసే వారి జాబితా అంటూ, సోషల్ మీడియాలో ఓ లీక్ హల్ చల్ చేస్తోంది. హీరోలు రాజ్ త‌రుణ్, వరుణ్ సందేష్, ఆర్యన్ రాజేష్ లతో పాటు సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, రాశి, చార్మికౌర్, గజాలా, చాందినీ చౌదరి, శ్రీరెడ్డి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, థ‌నీష్ , వైవా హ‌ర్ష, క‌మెడీయ‌న్ వేణులుంటారని తెలుస్తోంది. అయితే, ఈ జాబితాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.