పవన్‌కు గుడ్‌బై చెప్పింది

sri reddy say goodbye to Criticizing Pawan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ చాలా ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తుంది. పలువురు హీరోయిన్స్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడటం జరిగింది. అయితే శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ వివాదాన్ని నెత్తికి ఎత్తుకుని ఏకంగా అర్థ నగ్న ప్రదర్శణ చేయడంతో అందరి దృష్టి ఆమెపై పడటం జరిగింది. దాంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రహ కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా ముందుకు కదిలింది. ఇలాంటి సమయంలోనే శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం తప్పుడు దారి పట్టింది. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడం, పవన్‌ ఫ్యాన్స్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేయడంతో ఆమె కాస్టింగ్‌ కౌచ్‌పై ఇన్నాళ్లుగా చేసిందంతా కూడా వృదా అయ్యింది. ఆ విషయాన్ని గ్రహించిన శ్రీరెడ్డి మళ్లీ తన ఉద్యమంను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది. 

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ను డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తాజాగా నాకు ఎవరి మీద పగ లేదు. కాని ఒకరి తీరు వల్ల నేను బాగా హర్ట్‌ అయ్యాను. అందుకే కాస్త వ్యక్తిగతంగా విమర్శలు చేశాను. ఇకపై వ్యక్తిగత విమర్శలకు గుడ్‌బై చెబుతున్నా అంటూ పేర్కొంది. ఇప్పటి వరకు వ్యక్తుల మీద చేసిన ఉద్యమం ఇకపై వ్యవస్థ మీద చేస్తాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. చిత్ర సీమలో మార్పు కోసం తాను ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్దం అంటూ చెప్పుకొచ్చింది. ఇకపై ఒక క్రియాశీల పద్దతిలో కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా మహిళ సంఘాల వారితో కలిసి పోరాడతాను అంటూ చెప్పుకొచ్చింది. పవన్‌పై విమర్శలకు గుడ్‌బై చెబుతాను అంటూ శ్రీరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ కాస్త ఉపశమనం పొందుతున్నారు.