సునీత పిటిషన్‌ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సునీత పిటిషన్‌ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డాక్టర్ ఎన్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది.

సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్రా విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు తరపున హాజరవుతున్నందున ఆయన అందుబాటులో లేరని ధర్మస్థానానికి సమాచారం అందింది.

విచారణను మూడు వారాల పాటు వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాది ధర్మస్థానాన్ని అభ్యర్థించగా, ధర్మస్థానం అంగీకరించిం