సంక్రాంతి పోరులో ఫైనల్‌గా నాలుగు

telugu film to release in 2018

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

2017 సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్‌ ‘శతమానంభవతి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. ఆ చిత్రాలు మూడు కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. దాంతో 2018 సంక్రాంతికి కూడా భారీ ఎత్తున సినిమాలు విడుదల చేయాలని భావించారు. స్టార్‌ హీరోలకే చెందిన నాలుగు అయిదు సినిమాలు విడుదల చేయాని అనుకున్నారు. కాని చివరకు పవన్‌ ‘అజ్ఞాతవాసి’ మరియు బాలయ్య ‘జైసింహా’లు మాత్రమే స్టార్‌ మూవీలు వస్తున్నాయి. 

sankranthi-four-movie-relea

సంక్రాంతి బరిలో మరో రెండు చిన్న చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘రాజుగాడు’ చిత్రంకాగా మరోటి సూర్య తమిళంలో నటించి తెలుగులో డబ్‌ అవుతున్న ‘గ్యాంగ్‌’. ఈ నాలుగు సినిమాలు కూడా రెండు మూడు రోజుల గ్యాప్‌లోనే విడుదల కాబోతున్నాయి. అంచనాలు భారీగా ఉన్న ‘అజ్ఞాతవాసి’ మొదట ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆ తర్వాత ‘జైసింహా’ విడుదలకు సిద్దం అవుతుంది. ఇక ‘రాజుగాడు’ మరియు గ్యాంగ్‌ చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. గత సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు కూడా 50 కోట్ల వసూళ్లను క్రాస్‌ చేశాయి. మరి ఈసారి ఎన్ని సినిమాలు కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాయో చూడాలి.