Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు నయనతార ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాలతో పాటు తాజాగా ‘జైసింహా’ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. ఇటీవల బాలయ్యతో వరుసగా చిత్రాలు చేసిన హీరోయిన్గా నయనతార గుర్తింపు దక్కించుకుంది. యంగ్ స్టార్ హీరోయిన్స్ ఎవరు కూడా బాలయ్యతో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు అనే పుకారు సినీ వర్గాల్లో ఉంది. అందుకే బాలయ్య ఎక్కువగా నయనతారను తన సినిమాలో హీరోయిన్గా బుక్ చేసుకుంటున్నాడు అంటూ ఒక వర్గం వారు అంటున్నారు. ఈ విషయం ఎలా ఉన్నా కూడా నయనతార తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.
ఇప్పటి వరకు బాలయ్యతో మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించిన నయనతార ఉన్నట్లుండి తనకు ఆయన తండ్రితో సమానం అని, తండ్రిలా ఆయన్ను గౌరవించి, చేతులు ఎత్తి నమస్కరించాలని భావిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ బాలకృష్ణతో సినిమా చేసేప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఆయన గురించి ఇండస్ట్రీలో కొందరు తప్పుగా అనుకుంటారు. కాని ఆయన మాత్రం చాలా మంచి వ్యక్తి, ఆయన తనకు తండ్రితో సమానం, తన గురించి అన్ని విషయాల్లో ఆయన జాగ్రత్త తీసుకుంటూ, ఒక తండ్రిలా తనకు మద్దతుగా నిలుస్తాడు అంటూ నయనతార చెప్పుకొచ్చింది. ఒక హీరో గురించి ఆయనతో నటించిన హీరోయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. సహజంగా తాను నటించిన ఏ హీరో గురించి అయినా ఒక హీరోయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయదు. కాని నయన్ మాత్రం తండ్రితో సమానం అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.