TG Politics: తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. మార్చి 15 వరకు రైతుబందు లేదు

TG Politics: Big shock for Telangana farmers.. No farmer bandh till March 15
TG Politics: Big shock for Telangana farmers.. No farmer bandh till March 15

తెలంగాణ రైతులకు షాక్.. మార్చి 15 వరకు నో రైతుబందు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 15 వరకు అందరూ రైతులకు రైతుబందు ఇస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని అన్నారు.

వచ్చేనెల 15వ తేదీ లోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు.యాబై వేల ఓట్ల మెజార్టీతో వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు.