ఈ టీవీ ధర రూ. కోటి పైనే.. ఇండియాలో విడుదల చేసిన శాంసంగ్‌..?

A million micro
A million micro

మనం టీవీ కొంటే ఓ లక్ష రూపాయలో లేదా రూ.1.5 లక్షలో ఉంటుంది. కానీ ఇండియాలో కోటి రూపాయలపైగా విలువ చేసే శాంసంగ్‌ టీవీని లాంచ్‌ చేసింది.

LED Smart 4K TV ఫీచర్లు ఇవే:

శాంసంగ్‌ 110 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ 4కే డిస్‌ప్లేను ఇచ్చారు. సఫైర్‌ గ్లాస్‌తో తయారు చేసిన 24.8 మిలియన్‌ మైక్రో ఎల్‌ఈడీలు ఇందులో అమర్చారు. మైక్రో హెచ్‌డీఆర్‌, మల్టీ ఇంటెలిజెన్స్ AI అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్+ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో ఈ టీవీ ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా అమర్చిన ఆర్ట్‌ మోడ్‌, యాంబియంట్‌ మోడ్‌+ సాయంతో టీవీని ఆర్ట్‌ డిస్‌ప్లే వాల్‌గా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో ఈ టీవీ మార్కెట్లోకి వచ్చింది. దీని బెజెల్స్ ఇన్‌విజిబుల్‌గా ఉంటాయి. అంచులు కూడా చాలా సన్నగా ఉంటాయి.

దీంతోపాటు ప్రత్యేకంగా ఆర్ట్ మోడ్ కూడా ఈ టీవీలో అందించారు.మెరుగైన ఆడియో 100W RMS సౌండ్‌ సిస్టంను ఇందులో అమర్చారు. ఈ టీవీకి సోలార్‌ సెల్ రిమోట్‌ ఇచ్చారు.

మైక్రో ఎల్ఈడీల కారణంగా మైక్రో కాంట్రాస్ట్, మైక్రో హెచ్‌డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్,మైక్రో కలర్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం 6.2.2 ఛానెల్ సిస్టం ఉన్న 100W ఆర్ఎంఎస్ సౌండ్ సిస్టం కూడా ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్, క్యూ-సింఫనీ,ఓటీఎస్ ప్రో వంటి ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది. 110 అంగుళాల మైక్రో ఎల్ఈడీ టీవీలో సోలార్ సెల్ రిమోట్, ఇండోర్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. దీని మందం 2.49 సెంటీమీటర్లు కాగా, స్టాండ్ లేకుండా బరువు 87 కేజీలుగా ఉంది.