Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం రోజు రోజుకు సంచలనాలకు మారు పేరు అవుతుంది. పలువురు సెలబ్రెటీలు డ్రగ్స్ వాడుతున్నట్లుగా విచారణలో వెళ్లడి అవుతుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఎంతో మందికి డ్రగ్స్ను అలవాటు చేశాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పూరి విచారణ ఎదుర్కొన్నాడు. మరోసారి కూడా ఆయన సిట్ అధికారుల ముందుకు వెళ్లబోతున్నాడు. ఈ సమయంలోనే పూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూరికి డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయనతో వర్క్ చేసే వారందరికి స్వయంగా ఆయనే డ్రగ్స్ను సరఫరా చేస్తాడని, కొందరు వద్దన్నా కూడా ఒత్తిడి చేసి మరీ అలవాటు చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. డ్రగ్స్ను సినిమా సెట్స్కు కూడా తీసుకు వచ్చేవాడని, హీరోయిన్స్కు డ్రగ్స్ను అలవాటు చేసి, వారిని వాడుకోవడం పూరికి ఉన్న అలవాటు అంటూ ఆ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె పూరి దర్శకత్వంలో మెగా హీరోతో తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం కూడా ఆమె టాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు రాబట్టుకుంటున్న ఆమె చెప్పిన వివరాలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె విషయం సిట్ అధికారులకు చేరితే స్వయంగా ఆమెను విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి పూరి పూర్తిగా మునిగి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు