ట‌చ్ చేసి చూడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల 

Touch-Chesi-Chudu--Trailer
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ర‌వితేజ అభిమానులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్న ట‌చ్ చేసి చూడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. పోలీస్ గెట‌ప్ లో ర‌వితేజ మ‌రోసారి త‌న మార్క్ చూపించ‌నున్న‌ట్టు ఈ ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు. యానిఫాం తీసేస్తే రాయితో చంపుతానో, రాడ్ తో చంపుతానో నాకే తెలీదు అన్న డైలాగ్ ర‌వితేజ ఈజ్ కు త‌గ్గ‌ట్గుగా ఉంది.
ట్రైల‌ర్ లో ర‌వితేజ కుటుంబం గురించి మాట్లాడుతూ… ఎ ప్యామిలీ ఈజ్ యాన్ ఓష‌న్ ఆఫ్ ఎమోష‌న్స్. అస‌లు ఫ్యామిలీ అంటే అని డైలాగ్ చెబుతుంటే…వెన‌క నుంచి వ‌ద్దురా…రేయ్ వ‌ద్దు…అనే డైలాగ్ న‌వ్వుతెప్పిస్తోంది. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్, వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, శీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజా ది గ్రేట్ భారీ విజ‌యం త‌ర్వాత ర‌వితేజ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ట‌చ్ చేసి చూడుపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల కానుంది.