TS Politics: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని నాగార్జున

TS Politics: Akkineni Nagarjuna met CM Revanth Reddy
TS Politics: Akkineni Nagarjuna met CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున కలిసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ప్రముఖ సినీ హీరో నాగార్జున దంపతులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్చం ఇచ్చి, స్పెషల్ విషేష్‌ చెప్పారు. కాగా.. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కాగా, ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.

గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రజా పాలన దరఖాస్తుల సరళి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.