ఆ ఫోటోలు చూస్తే వంగవీటికి మంటెత్తిపోతోంది.

Vangaveeti Fires
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కాపుల్ని వైసీపీ కి దగ్గర చేయడానికి ఆ పార్టీకి వున్న ప్రధాన అస్త్రాల్లో వంగవీటి రాధా ఒకరు. ఆయన శక్తిసామర్ధ్యాలు పక్కనబెడితే దివంగత వంగవీటి రంగా తనయుడిగా ఆయనకి స్పెషల్ క్రేజ్ వుంది. ఎంత వున్నా రాజకీయంగా వైసీపీ లో రాధా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఆ పార్టీని వదిలేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకి వచ్చారట. అయితే ఆయన్ని ఇంతగా ఇబ్బంది పెడుతోంది రాజకీయ సమఉజ్జీ మాత్రం కాదు. రంగా మీద నోరుపారేసుకుని పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన గౌతమ్ రెడ్డి. పార్టీ నుంచి బయటికి వెళ్ళాక రాధాకృష్ణని ఇబ్బంది పెట్టడానికి గౌతమ్ రెడ్డి పూర్తి టైం కేటాయిస్తున్నారట. ఏమి చేస్తే రాధా ఇబ్బంది పడుతారో అదే చేస్తున్నారు. 
రంగా మీద కామెంట్స్ తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ రెడ్డి మీద వేటేసింది వైసీపీ. అయితే ఆ పార్టీ అధినేత జగన్ కుటుంబంతో గౌతమ్ రెడ్డికి దూరపు బంధుత్వం ఉందట. దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన జగన్ సోదరుడు,కడప ఎంపీ అవినాష్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతో సమావేశం అయ్యారు. అప్పుడు తీసుకున్న ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ లు ఇప్పుడు విజయవాడ నిండా దర్శనమిస్తున్నాయి. రాధా ఏ పని మీద బయటికి వచ్చినా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి నన్ను బయటికి పంపినా అధిష్టానంతో నా సంబంధాలు అలాగే వున్నాయి అని గౌతమ్ రెడ్డి ఆ ఫొటోలతో సవాల్ విసిరినట్టు అనిపిస్తోందట రాధకి. అయినా ఎలాగోలా ఓర్చుకుందామని చూసినా ఇటీవల వైసీపీ కార్యవర్గ కూర్పులో విజయవాడకి సంబంధించి గౌతమ్ రెడ్డి అనుచరులకు పెద్ద పీట వేసింది పార్టీ. ఇదేమిటని సాక్షాత్తు అధినేత జగన్ ని అడిగినా వచ్చిన సమాధానం సంతృప్తిగా లేదు. ఈ పరిస్థితుల్లో అవినాష్ తో గౌతమ్ రెడ్డి ఫోటోలు చూస్తుంటే రాధాకృష్ణ కి మంటెత్తిపోతుందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ అసంతృప్త జ్వాలలు ఇంకెన్నో రోజులు దాగవు.