Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఫిలింఛాంబర్ లో పవన్ నిరసనపై మండిపడింది. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ దుమ్మెత్తిపోసింది. గూండాగిరీ చేస్తే స్పెషల్ స్టేటస్ రాదు పీకే..ప్రాస్టిట్యూషన్ ను లీగలైజ్డ్ చేయాలని అంటున్నది వాకాడ అప్పారావు కోసమా..? 3,4 పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకా…అని పోస్టులో ప్రశ్నించింది. ఏదో పొలిటికల్ అజెండాతో అనగా చంద్రబాబునాయుడి దీక్ష నుంచి చూపు మరల్చేందుకు అమ్మ పేరుతో నిన్న మా అసోసియేషన్ కు వచ్చిన నువ్వు ఫుల్ నెగటివ్ మార్కులు వేయించుకుని వెళ్లావు.
మీ అమ్మకు నువ్విచ్చిన విలువ కన్నా..నేను ఎక్కువ విలువిస్తాను. మా మహిళా సంఘానికి ఆమె పేరే పెడతా…జిందాబాద్ అంజనాదేవి అని పోస్ట్ చేసింది. ఇక బట్టలు విప్పి మాట్లాడుకుందాం..అని పవన్ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ కొత్త సినిమా..రాళ్లేసి కొట్టుకుందాం రా…తిక్కకి లెక్కలేదు. ఈ పేర్లు కూడా బాగుంటాయి అని ఎద్దేవా చేసింది. నువ్వు చితక్కొట్టించింది మీడియా వాళ్ల కార్లను కాదు…జర్నలిస్టుల మనోభావాలని…కాస్కో నా వాస్కోడిగామా…అని సవాల్ విసిరింది. అటు పవన్ కళ్యాణ్ మీద ఇక కామెంట్ చేయనని మదర్ మీద ఒట్టేసి…ఆవిడ పర్మిషన్ తో ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ లాయర్లతో చర్చిస్తున్న వీడియోను పోస్ట్ చేసిన వర్మ వావ్…ఫస్ట్ టైమ్ లాయర్ల కన్నా క్లయింట్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అంత డబ్బు ఉండగా..కాస్త మంచి లాయర్లను పెట్టుకోవచ్చుగా..ఒక వేళ ఆయన ఫ్యాన్స్ ప్రొడక్షన్ గోడౌన్ నుంచి నల్లకోట్లు వేసుకుని వచ్చి అక్కడ కూర్చోలేదు కదా..అంటూ ఎద్దేవా చేశారు వర్మ.