చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత

venkaiah Naidu polls publicity on ap special package money

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వెంకయ్యను మించి పబ్లిసిటీ చేయడం దేశంలో ఎవరికీ చేతకాదంటే నిజమే అనుకోవాలి. ఏపీకి ఆయన ఒరగబెట్టిన మేలెంతో జనానికి బాగా తెలుసు. కానీ ఆయన మాత్రం ఏదో అసాధ్యాన్ని సాధించేసినట్లుగా డప్పు కొట్టుకుంటున్నారు. సహజంగా సన్మాన సభ అంటే సన్మానించే వ్యక్తి గురించి పక్కవారు చెప్పాలి. కానీ వెంకయ్య మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మోడీని పొగిడినట్లే తనను తాను పొగుడుకుంటూ మాటల గొప్పలు చెబుతున్నారు.

ఏపీకి హోదా విషయంలో వెంకయ్య మార్చినన్ని మాటలు మరెవరూ మార్చలేదు. ఏపీకి తీపికబురు వస్తుందంటూ నెలల తరబడి ఊరించిన వెంకయ్య చివరకు అరకొర ప్యాకేజీతో సరిపెట్టారు. బీజేపీ హోదా ఇవ్వదని తెలిశాక.. అదేం సర్వరోగ నివారిణి కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. వెంకయ్య చాణక్యం అంతా ఇక్కడే ఉంది. అందుకే ఆయన్ను మించిన భజనపరులు బీజేపీలో తయారవ్వాలంటే అంత వీజీ కాదు.

ఏపీకి సహజంగా వచ్చేవి కూడా తానే సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు వెంకయ్య. ఏపీకి వచ్చిన ప్రతి పైసా పైనా నా పేరే ఉంటుందనే రేంజ్ లో ఇస్తున్న వెంకయ్య పబ్లిసిటీ చూసి అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. తన ప్రాసలతో ఆకట్టుకునే వెంకయ్య.. ఇప్పుడు చేసిన మేలు గురించి ప్రాస వేసి మరీ వాయించేస్తున్నారు. వెంకయ్య చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత లాగా ప్రచారంలో కూడా అతి ఎక్కువైందనేది ఏపీ జనం మాట.

మరిన్ని వార్తలు:

వన్ కులం కోసం పోరాడరట

నంద్యాలలో వైసీపీ గెలిస్తే జగన్ సీఎం ?

రజనికి రూట్ క్లియర్ చేసిన కమల్ ?