
రౌడీ హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda తన కెరీర్లో మైల్స్టోన్గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కీలకమైన అప్డేట్ను అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ఈ కల్ట్ క్లాసిక్ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఆగస్టు 25, 2027న అన్కట్ వర్షన్లో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఈ సినిమాను ఇష్టపడే సినీ ప్రేమికుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ అప్పట్లో టాలీవుడ్లో ఒక ట్రెండ్సెట్టర్గా నిలిచింది. డిఫరెంట్ టేకింగ్, బోల్డ్ కంటెంట్, విజయ్ దేవరకొండ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్తో ఈ సినిమా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ నటన ఆయనకు ఒక్కసారిగా భారీ స్టార్డమ్ తీసుకొచ్చింది.
ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాను అన్కట్ వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండటం ఆసక్తిని పెంచుతోంది. అప్పటి సెన్సార్ ప్రక్రియలో తొలగించిన సన్నివేశాలను కూడా కలుపుతూ, దర్శకుడు మొదట ఊహించిన మరింత రా అండ్ రస్టిక్ కట్ను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో అప్పట్లో థియేటర్లలో చూసిన అభిమానులు మరోసారి ‘అర్జున్ రెడ్డి’ మేనియాను ఎక్స్పీరియన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో షాలినీ పాండే కథానాయికగా నటించగా, విజయ్ దేవరకొండ కెరీర్లో ఈ చిత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.
పదేళ్ల తర్వాత అన్కట్ వర్షన్తో ‘అర్జున్ రెడ్డి’ థియేటర్లలోకి రావడం అభిమానులకు నిజంగానే స్పెషల్ ట్రీట్గా మారనుంది.





