మగధీర రిపీట్‌ కానుందా? ఇదే సాక్ష్యం

will rajamouli directed film with ram charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ చరిత్రలో మగధీరకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది. దాదాపు పది సంవత్సరాల పాటు నెం.1 సినిమాగా ఆ సినిమా నిలిచింది అంటే అప్పట్లో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆ అద్బుత కావ్యంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించాడు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమా కాంబో రిపీట్‌ కాబోతుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాలో హీరోగా రామ్‌ చరణ్‌ నటించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

‘బాహుబలి’ సినిమా తర్వాత ఆరు నెలల గ్యాప్‌ తీసుకుంటాను అంటూ ప్రకటించిన రాజమౌళి బ్రేక్‌ నుండి తిరిగి వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రాజమౌళి ప్రస్తుతం తన తర్వాత సినిమా స్క్రిప్ట్‌ పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో పలు కథా చర్చలు జరిగాయి. ఒక కథను ఫైనల్‌ చేయడం, దాన్ని దాదాపు మూడు రోజుల పాటు రామ్‌ చరణ్‌కు చెప్పడం కూడా జరిగిందట. ఆ కారణంగానే ఇటీవల ఇద్దరు పదే పదే కలుసుకోవడం, పలు వేడుకల్లో ఇద్దరుగా పాల్గొనడం చేస్తున్నారని, ఇద్దరి కాంబో మూవీకి ఇదే సాక్ష్యం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తే టాలీవుడ్‌ నెం.1 హీరోగా చరణ్‌ మారిపోవడం ఖాయం.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ ట్రైలర్…ఎన్టీఆర్ నట విశ్వరూపం

ఎందుకు అదే అడుగుతున్నారు?

అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చ‌ర‌ణ్ కూడా…