దొంగ సొత్తు బయట పడెయ్యండి రేపే వస్తాం…!

YCP Mlas Letter To Speaker Kodela
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని కోడెల చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాస్తున్నామని పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టి సభ నడుపుతున్న స్పీకర్  వారిని ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కాపాడుతున్న స్పీకర్ ప్రజాస్వామ్య వాక్కులు వల్లించటం చూసిన తరువాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నామని వారు లేఖలో పేర్కొన్నారు.
speaker
రేపటి నుంచి మీరు పెడుతున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరుకావటానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఈ రోజే మీ ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించండి. ప్రజా స్వామ్య దేవాలయంలో ఉన్న మీ దొంగ సొత్తును ఈరోజే బయటపడేయండి. ఇదే విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పాం. ఆ తర్వాత మరో లేఖ వ్రాసమని ఇప్పుడు మరోసారి చెపుతున్నామని ఈ రోజే వారిని తొలగించండి, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరవుతామని ఆ లేఖలో వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
ycp-mlas