టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు !!

IT notices to TDP chief Chandrababu !!
IT notices to TDP chief Chandrababu !!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందాయని సమాచారం అందుతోంది. అమరావతి కాంట్రాక్టర్ లు అయిన ఎల్ అండ్ టి, షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్) సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు ముట్టాయని సమాచారం. ఈ క్రమంలో.. చంద్రబాబు షోకాజ్ నోటీసులపై అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది.

చంద్రబాబుకు బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు ఆదాయ పన్ను శాఖ అధికారులు సేకరించారట. మనోజ్ వాసుదేవ్ ఇంట్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందట. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారట. అభ్యంతరాలను చంద్రబాబు తిరస్కరించిన తర్వాత.. హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.