వై.యస్.రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్య‌క్ర‌మం..!

YS Rajasekhara Reddy's 14th death anniversary program..!
YS Rajasekhara Reddy's 14th death anniversary program..!

వైసీపీ కేంద్ర కార్యాలయంలో వై.యస్.రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వహించనున్నారు వైసీపీ పార్టీ నేతలు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజశేఖర రెడ్డికి ఘనంగా వైసీపీ పార్టీ నివాళులు అర్పించనుంది . పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టనున్నాయి పార్టీ శ్రేణులు. ఇక ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి,ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు, నేతలు పాల్గొననున్నారు.

కాగా,ఇవాళ కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్‌. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్‌ నివాళులు అర్పించనున్నారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు సీఎం జగన్‌ చేరుకోనున్న … మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు.