సీఎం యోగికి షాక్.. వాట్సాప్ బాంబు కలకలం…..

up-chief-minister-yogi-adityanath-targets-rahul-gandhi

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఓ వాట్సాప్ మెసేజ్ వణికించేస్తుంది. కొందరు దుండగులు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్‌ను పోలీసులకు పంపించారు. దీంకో యూపీ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ తినింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోద చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే యూపీ పోలీసు ప్రధాన కార్యాలయం ‘వాట్సాప్ నంబర్‌కు పంపిన సందేశంలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని.. సమాజానికి అతను ముప్పుగా పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. సీఎం యోగిని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించారని కూడా ఆ అధికారి వివరించారు. కాగా గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ సందేశం రావడంతో.. వెంటనే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనపై గోమతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అలాగే.. కేసును సీరియస్‌గా తీసుకున్నామని… ఇది ఆకతాయిల పనా? లేదా సీఎంపై కుట్ర జరుగుతుందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది యూపీలో ఉత్కంఠకు దారితీస్తుంది.