తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గేయ రచయితగా, ఆస్కార్ విజేతగా గుర్తింపు పొందిన చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (కనుకుంట్ల రాజేంద్రప్రసాద్) ఆకస్మికంగా కన్నుమూశారు. నిన్న ఉదయం అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యులను, సన్నిహితులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడిన రాజేంద్ర, వ్యాపార పనుల నిమిత్తం శనివారం అన్నమయ్య జిల్లా కలికిరికి చేరుకున్నారు. అక్కడ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో సమీప ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం సమీప హోటల్లో టిఫిన్ చేస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ అనూహ్య మృతితో చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పలువురు సినీ ప్రముఖులు, మిత్రులు చంద్రబోస్కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.