‘డీజే’ కాంబో ఫిక్స్‌

Allu Arjun Pooja Hegde and Harish Shankar combo movie repeats

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌, హరీష్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో గత సంవత్సరం తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డీజే’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించి, అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచింది. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అల్లు అర్జున్‌ చేసిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అంచనాలు తారుమారు చేస్తూ ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేయాలని భావించారు. కాని అనూహ్యంగా అల్లు అర్జున్‌ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. నా పేరు సూర్య ఫ్లాప్‌తో తన నిర్ణయాన్ని మార్చుకుని తన తదుపరి చిత్రాన్ని హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఇటీవలే దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరియు అల్లు అర్జున్‌లు కలుసుకున్నారు. వారితో పాటు హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా ఉండటం ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. అంటే డీజే కాంబినేషన్‌ అయిన అల్లు అర్జున్‌, హరీష్‌ శంకర్‌, పూజా హెగ్డే ఈ ముగ్గురు మరోసారి కలిసి వర్క్‌ చేయబోతున్నారు. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారి ప్రకటన అయితే రాలేదు. కాని త్వరలోనే ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ‘డీజే’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించాడు. మరి ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు ఎవరు నెత్తికి ఎత్తుకుంటారు అనే విషయంపై చర్చ జరుగుతుంది. డీజే చిత్రం తర్వాత హరీష్‌ శంకర్‌ మరో సినిమాను దిల్‌రాజు బ్యానర్‌లోనే చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ‘దాగుడు మూతలు’ అనే చిత్రంను దిల్‌రాజు బ్యానర్‌లో హరీష్‌ శంకర్‌ చేయాలని భావించాడు. కాని ఇప్పుడు అల్లు అర్జున్‌తో మూవీకి రంగం సిద్దం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ‘దాగుడు మూతలు’ లేనట్లే అంటూ సమాచారం అందుతుంది.