రంగమ్మగా సోషల్‌ మీడియాలో రీ ఎంట్రీ

Anasuya Posted Rangammattha Still in Rangasthalam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొన్ని వారాల క్రితం అనసూయ సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పిన విషయం తెల్సిందే. ఒక సంఘటన కారణంగా అనసూయపై కొందరు సోషల్‌ మీడియాలో ఘాటు పదజాలంతో కామెంట్స్‌ చేశారు. దాంతో మనస్థాపం చెందిన అనసూయ కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాకు పూర్తి దూరంగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు మళ్లీ రావాలని అభిమానులు కొందరు సినీ వర్గాల వారు కూడా కోరడం జరిగింది. దాంతో అనసూయ సరైన సమయంలో సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇస్తాను అంటూ ప్రకటించింది. అన్నట్లుగానే ఉగాదిని పురష్కరించుకుని తన ‘రంగస్థలం’ లుక్‌ను రివీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

నేడు ఉదయం రంగస్థలంలోని రంగమ్మత్త లుక్‌ను అనసూయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మొదటి నుండి కూడా ఈ లుక్‌పై సస్పెన్స్‌ పెడుతూ వచ్చారు. తాజాగా అనసూయ రంగమ్మత్త లుక్‌ రివీల్‌ అవ్వడంతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతుంది. గత రెండు మూడు రోజులుగా రంగస్థలం గురించి ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. తాజాగా అనసూయన తన రంగస్థలం లుక్‌ విడుదల చేయడంతో ఆ ట్రెండ్స్‌ మరింతగా పెరిగాయి. ప్రస్తుతం రంగమ్మత్త లుక్‌కు అనూహ్య స్పందన వస్తుంది. మరోవైపు అనసూయ సోషల్‌ మీడియా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత రంగమ్మత్తగా తనకు మరితం గుర్తింపు వస్తుందనే నమ్మకంను అనసూయ వ్యక్తం చేస్తుంది.