AP Politics: జనసేన పార్టీలో చేరిన జానీ మాస్టర్‌..!

AP Politics: Johnny Master joined Janasena party..!
AP Politics: Johnny Master joined Janasena party..!

టాలీవుడ్ స్టార్‌ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ సమక్షంలో జానీ మాస్టర్ జనసేన కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్‌ గత కొన్నిరోజులుగా అక్కడే విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ప్రజా సమస్యలపై పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే తానెంతో అభిమానించే పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీలో చేరారు. త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జానీ మాస్టర్‌ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి ఈ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ బరిలోకి దిగనున్నాడని ప్రచారం జరుగుతోంది. చూడాలి ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడనేది.