AP Politics: ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసిన శివాజీ ..!

AP Politics: Shivaji made sensational comments on AP politics..!
AP Politics: Shivaji made sensational comments on AP politics..!

నటుడు శివాజీ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. తాజాగా ఏపీ రాజకీయాలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో మంచి చేసే వారిని ప్రజలు ఎన్నుకోవాలని అన్నారు. డబ్బుకి ఓటు అమ్ముకోవద్దని చెప్పారు శివాజీ. అనంతపురం జిల్లా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, నేటితరం నాయకుల్లా దోపిడీకి తెర లేపలేదని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్ని దోచుకోమని వారసులకి ఎన్టీఆర్ చెప్పలేదని అన్నారు శివాజీ. ఎన్టీఆర్ లాంటి నాయకులు ఈ తరంలో లేరని చెప్పారు ఆయన చేసిన సేవలు కూడా ఎవరు చేయలేరని శివాజీ చెప్పారు. టికెట్ల వ్యవహారంలో సూట్ కేసులు ఇవ్వని వరకు రాజకీయాల్లో మార్పులు రావని చెప్పారు. శివాజీ దొంగ ఓట్లపై ప్రజలే నిరదీయాలని చెప్పారు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు శివాజీ అయితే శివాజీ చేసిన కామెంట్స్ జగన్ మీదేనని ఏపీ రాజకీయాల గురించి అని, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.