AP Politics: వైసీపీకి షాక్…నేడు టీడీపీలో చేరనున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

AP Politics: Shock for YCP... Rebel MLAs of YCP will join TDP today
AP Politics: Shock for YCP... Rebel MLAs of YCP will join TDP today

వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగులనుంది. నేడు టీడీపీలో చేరనున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసిపి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాటికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) ఇవాళ టీడీపీలో చేరనున్నారు.

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకొనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.