అశ్వినీదత్‌ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లేనా?

ashwini dutt started high budget movies with dil raju

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవితో ఎన్నో అద్బుతమైన సినిమాలు తీయడంతో మెగా ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ గత కొన్నాళ్లుగా నిర్మాణంకు దూరంగా ఉంటున్నాడు. ‘శక్తి’తో పాటు ఇంకా వరుసగా పలు సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సినిమాల నుండి తేరుకోవడానికి అశ్వినీదత్‌కు కాస్త సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. తాజాగా మళ్లీ అశ్వినీదత్‌ ఫాంలోకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

అశ్వినీదత్‌ కూతురు ప్రియాంక దత్‌ సొంత బ్యానర్‌పై చిన్న సినిమాలను నిర్మించి, ఇప్పుడు తండ్రి బ్యానర్‌ అయిన వైజయంతి మూవీస్‌లో పెద్ద సినిమాలు నిర్మించేందుకు సిద్దం అయ్యింది. అశ్వినీదత్‌ ఆమెకు సహకరిస్తున్నాడు. ప్రస్తుతం అల్లుడి దర్శకత్వంలో ‘మహానటి’ సినిమాను అశ్వినీదత్‌ నిర్మిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో నిర్మించబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తి కాకుండానే మరో క్రేజీ ఫిల్మ్‌ను పట్టాలెక్కించేందుకు అశ్వినీదత్‌ సిద్దం అయ్యాడు. నాగార్జున, నానిల మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా అశ్వినీదత్‌ ప్రకటించాడు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్‌ ఉండబోతుందని కూడా అశ్వినీదత్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మళ్లీ వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయినట్లే అంటూ సినీ వర్గాల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అయినా కాస్త ఆలోచించి శక్తిలాంటి సినిమాలు తీయవద్దని ఆయన సన్నిహితులు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ ట్రైలర్…ఎన్టీఆర్ నట విశ్వరూపం

ఎందుకు అదే అడుగుతున్నారు?

అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చ‌ర‌ణ్ కూడా…