హైదరాబాద్‌లో దారుణం..భార్యను చంపి, భర్త సూసైడ్.. అక్రమ సంబంధమే కారణమా.?

Atrocity in Hyderabad..Wife killed, husband committed suicide..Is it because of illicit relationship?
Atrocity in Hyderabad..Wife killed, husband committed suicide..Is it because of illicit relationship?

భాగ్యనగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య సంతోషను చంపి, రెండు అంతస్థుల భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ తపోవన్ కాలనీలో చోటు చేసుకుంది. నాగోల్ కు చెందిన రాజు…తన భార్య సంతోషకు గత కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. భార్య సంతోషపై భర్త రాజుకు అనుమానం ఉంది. ఇటీవలే ఓ ప్రైవేట్ స్కూల్ ల్లో ఆయాగా చేరింది సంతోష.

ఈ తరుణంలోనే సోమవారం రాత్రి భార్యాభర్తలు మధ్య తగాదా జరిగింది. దీంతో భార్య‌ సంతోషను చంపి తపోవన్ కాలనీలోని చెల్లులు ఇంటికి వెళ్ళిన రాజు… చెల్లెలు ఇంట్లోకి వెళ్ళకుండ నేరుగా రెండంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజు‌ ఇవాళ ఉదయం మా ఇంటికి వచ్చాడు, కాని తలుపు కొట్టలేదన్నారు మృతుడు రాజు చెల్లెలు మంజుల‌. బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకి ఎవరో చనిపోయారని మా పక్కింటి వాళ్ళు చెప్పారు….షర్ట్ ను చూసి చనిపోయింది మా అన్నగా గుర్తించానని వెల్లడించారు మృతుడు రాజు చెల్లెలు మంజుల‌. మా వదినకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని.. ఆమె కూడా మరణించినట్లు తెలిసిందన్నారు.