బాబోయ్‌.. సస్పెన్స్‌తో చంపేస్తున్నారు

audience interesting for ntr and ram charan combo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత చేయబోతున్న చిత్రంపై మెల్ల మెల్లగా క్లారిటీ వచ్చేస్తోంది. ఇటీవలే రాజమౌళి ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్‌, చరణ్‌లు ఉన్నారు. ఇద్దరి కలయికలో సినిమాను జక్కన్న చేయబోతున్నట్లుగా అంతా భావించారు. అందులో ఎంత నిజం ఉన్న విషయాన్ని మాత్రం జక్కన్న కాని ఆ ఇద్దరు హీరోలు కాని తేల్చి చెప్పలేదు. మౌనం అర్థ అంగీకారం అన్నట్లుగా భావించిన సోషల్‌ మీడియా జనాలు గాల్లో మేడలు కట్టినట్లుగా మల్టీస్టారర్‌ చిత్రం గురించి ఏవేవో ఊహలు అల్లేస్తున్నారు.

audience-waiting-for-ntr-an

ఎన్టీఆర్‌, చరణ్‌ల కాంబో మూవీ రాబోతుందని, ఇద్దరు అన్నదమ్ముళ్లుగా నటించబోతున్నారు, 150 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మించేందుకు సిద్దం అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే మరో ఫొటో సోషల్‌ మీడియా హల్‌ చల్‌ చేయడం మొదలు పెట్టింది. ఈ ఫొటో చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు చాలా క్లోజ్‌గా కనిపిస్తూ, ఇద్దరు విక్టరీ సింబల్‌ను చూపిస్తున్నారు. ఈ ఫొటో వీరిద్దరి మల్టీస్టారర్‌ను మరింతగా దృడపరుస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఎప్పుడెప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల వారిని కూడా సస్పెన్స్‌తో చంపేస్తున్నాయి. నిజం ఏంటనేది ఎప్పుడు తెలుస్తుందో కాని మెగా మరియు నందమూరి అభిమానులు మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.