‘జైసింహా’ పరిస్థితి ఏంటో… టెన్షన్‌లో ఫ్యాన్స్‌

Balakrishna Fans worried on Agnathavasi movie result

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత రెండు మూడు నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి ఇంకో అయిదు రోజులు ఉండగానే ఫ్యాన్స్‌కు మరియు ప్రేక్షకులు సంక్రాంతి పండగ రాబోతుందని నిన్న మొన్నటి వరకు ఎదురు చూశారు. పండగను తీసుకు వస్తుందని భావించిన అజ్ఞాతవాసి చిత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌ కూడా తీవ్రంగా నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్‌లో టెన్షన్‌ మొదలైంది. పవన్‌కు పోటీగా అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘జైసింహా’ ఈనెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

గత సంవత్సరం సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తాను అంటూ బాలయ్య నమ్మకంతో ఉన్నాడు. కాని ఎన్నో అంచనాలున్న అజ్ఞాతవాసి అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఇప్పుడు ‘జైసింహా’ ఫలితంపై కాస్త ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి కొన్ని గంటల్లో జైసింహా ఫలితం కూడా తేలిపోయే అవకాశం ఉంది. అయితే అజ్ఞాతవాసి సినిమాకు ఉన్నంత అంచనాలు జై సింహాకు లేక పోవడం కాస్త బెటర్‌ అని చెప్పుకోవచ్చు.

అజ్ఞాతవాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నందున సినిమా బిలో యావరేజ్‌గా ఉండటంతో అట్టర్‌ ఫ్లాప్‌ అంటూ టాక్‌ వస్తుంది. అయితే జైసింహా చిత్రంకు అంచనాలు అంతగా లేకపోవడం వల్ల యావరేజ్‌గా ఉన్నా కూడా సినిమా నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, నటాషా, హరిప్రియలు హీరోయిన్స్‌గా నటించారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్‌కు ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుందో చూడాలి.