అంచనాలు పెంచేసిన ‘జైసింహా’ సెన్సార్‌ రిపోర్ట్‌

balakrishna-jai-simha-movie-censor-talk
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం ‘జైసింహా’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ‘జైసింహా’ చిత్రం తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. దాంతో పాటు సినిమాపై సెన్సార్‌ బోర్డు వారు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రెండు పాత్రల్లో కూడా బాలయ్య మంచి నటనతో ఆకట్టుకున్నాడని, బాలయ్య అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉంది అంటూ సెన్సార్‌ బోర్డు సభ్యులు ఆఫ్‌ ది రికార్డు చెబుతున్నారు. సెన్సార్‌ రిపోర్ట్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి.

బాలయ్య 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా సంక్రాంతికి విడుదలైన విషయం తెల్సిందే. అందుకే ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా బాలయ్య విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని, సెంటిమెంట్‌ ప్రకారం చూసుకున్నా లేదా మరే రకంగా చూసుకున్నా కూడా అన్ని విధాలుగా ‘జైసింహా’ ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య, నయనతార కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా మళ్లీ ఆ కాంబోకు విజయాన్ని తెచ్చి పెడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బాలయ్య కెరీర్‌లో నిలిచి పోయే సినిమా ఈ చిత్రం కలెక్షన్స్‌ ఉంటాయని సినీ వర్గాల వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.