ఆ జంతువుల వల్ల ‘సాక్ష్యం’ ఆలస్యం?

Sakshyam movie censor problems

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. భారీ అంచనాల నడుమ రూపొందిన సాక్ష్యం చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మొదట అనుకున్నట్లుగా అయితే వచ్చేవారం అంటే ఈనెల 27న విడుదల కావాల్సి ఉంది. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా పూర్తి అయిన నేపథ్యంలో చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. కాని చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలకు పెద్ద చిక్కు వచ్చింది.

సెన్సార్‌ బోర్డు అడ్డు చెప్పడంతో ఈ చిత్రం అనుకున్న సమయంకు విడుదల అవ్వడం కష్టమే అని తేలిపోయింది. ఈ చిత్రంను దర్శకుడు సోషియో ఫాంటసీగా తెరకెక్కించాడు. కథనంలో భాగంగా పెద్ద ఎత్తున జంతువును షూటింగ్‌ కోసం వాడటం జరిగింది. సెన్సార్‌ రూల్స్‌ ప్రకారం చిత్రంలో షూటింగ్‌ కోసం వాడిన జంతువులకు సంబంధించిన అనుమతి పత్రాలు తప్పనిసరిగా సెన్సార్‌ బోర్డుకు జత పర్చాల్సి ఉంటుంది. కాని జంతువులకు సంబంధించిన అనుమతి పత్రాలను తీసుకోలేదు. దాంతో ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. ఆ పత్రాలు రావాలి అంటే కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉందట. దాంతో సినిమాను అనుకున్న డేట్‌కు విడుదల చేయలేం అంటూ నిర్మాతలు తేల్చి చెప్పారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారేమో చూడాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప అనుకున్న తేదీకి విడుదల కాదు.