జోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి

Bithiri Sathi sings Jogendra Theme Song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రానా, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను జోగేంద్ర యువ గర్జన పేరుతో నిర్వహించడం జరిగింది. ఈ చిత్రంలో రానా జోగేంద్ర అనే యువ రాజకీయ నాయకుడు. అందుకే ప్రీ రిలీజ్‌ వేడుకను ఇలా ప్లాన్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. పువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తి కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించాడు. ప్రముఖులు మాట్లాడుతున్న సమయంలో బిత్తిరి సత్తి వేసిన పంచ్‌ డైలాగ్‌లు ఆయన చెప్పిన కొన్ని ముచ్చట్లు అందరిని అలరించాయి. 

రెగ్యులర్‌గా కాకుండా ఈ సారి కాస్త భిన్నంగా, మోడ్రన్‌ డ్రస్‌లో బిత్తిరి సత్తి కనిపించాడు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ జోగేంద్ర పాటను సత్తితో పాడివ్వడం చెప్పుకోదగ్గ విషయం. మొత్తం కార్యక్రమంలో సత్తి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కనిపించింది. రానా మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు మస్త్‌ మస్త్‌గా సత్తి మాటలను ఎంజాయ్‌ చేశారు. సినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుందని, రానా కెరీర్‌లో ఇదో అద్బుతమైన చిత్రంగా నిలుస్తుందని, రానాకు హీరోగా ఈ చిత్రం అతి పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ను అందిస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు, సినీ వర్గాల వారు ఉన్నారు. రానా మరియు కాజల్‌ల మద్య కెమిస్ట్రీకి మాస్‌ ఆడియన్స్‌ ఫిదా అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈనెల 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నా

 

మరిన్ని వార్తలు:

లవకుమార్‌ వచ్చేస్తున్నాడోచ్‌..!

బన్నీ, చరణ్‌ ప్రత్యక్ష యుద్దం.. ఇదే సాక్ష్యం