బన్నీ, చరణ్‌ ప్రత్యక్ష యుద్దం.. ఇదే సాక్ష్యం

rangasthalam 1985 Naa peru Surya Naa Illu India Release on Sankranthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరోలైన అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ల మద్య పరోక్ష యుద్దం జరుగుతుందని, ఇద్దరు పైకి చూసేందుకు నవ్వుకుంటూ మాట్లాడుతున్నా కూడా లోలోపల మాత్రం ఇద్దరు ఒకరితో ఒకరు యుద్దాలు చేసుకుంటున్నారనే విషయం అందరు అనుకునే విషయం. రామ్‌ చరణ్‌ సినిమా సక్సెస్‌ అయితే అల్లు అర్జున్‌ కడుపులో మంట, అల్లు అర్జున్‌కు సక్సెస్‌ దక్కితే చరణ్‌కు ఆగ్రహం. ఇలా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేండి మెగా ఫ్యామిలీలో టాప్‌ హీరో నేను అవ్వాలి అంటే నేను అవ్వాలి అనేది వారి కోరిక.

ఇన్ని రోజులు పరోక్షంగా యుద్దం చేసుకున్న ఈ ఇద్దరు మెగా హీరోలు మొదటిసారి ప్రత్యక్ష యుద్దంకు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరు నటించిన సినిమాలు ఒకే సారి విడుదలైంది లేదు. కాని మొదటి సారి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద మెగా హీరోలు ఫైటింగ్‌కు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి ‘రంగస్థలం’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఫిక్స్‌ అయ్యారు. ఆ సినిమా డేట్‌ ఫిక్స్‌ చేశారని తెలిసి కూడా అల్లు అర్జున్‌ కూడా సంక్రాంతికే వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రాన్ని అల్లు అర్జున్‌ చేస్తున్నాడు. ఆ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నేడు ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ప్రారంభం రోజే సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు చిత్రాలతో పాటు సంక్రాంతికి బాలయ్య 102వ చిత్రం మరియు మహేష్‌బాబు, కొరటాలల ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి స్టార్‌ హీరోల వార్‌ భారీగా ఉండబోతుంది.

మరిన్ని వార్తలు:

స్పైడర్‌ ఓవర్సీస్‌ దూకుడు…

ఒక్క సినిమాలో 48 కట్స్‌ ఏంట్ర బాబోయ్‌..!

దాన్ని వదిలేది లేదన్న కృష్ణవంశీ